అనంతగిరి మండల్ పరిధిలోని పాలవరం గ్రామంలో ఆదివారం ముత్యాలమ్మ బోనాలు పండుగ ఘనంగా నిర్వహించారు .సంప్రదాయ ప్రకారం గ్రామ పెద్దలు అమ్మవారికి తోలి బోనాలు చేల్లించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గ్రామ ప్రజలు, పిల్ల పాపలతో సంతోషంతో ఉండి వర్షాలు పడి పంటలు బాగా పండి అభివృద్ధి చెందాలని ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారని అన్నారు ,ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరినీ నుండి రక్షణ కోసం గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment