Tuesday, April 14, 2020

"మోర్చా శిబిరం."!

తెలంగాణలో  లాక్ డౌన్  గడువు పెంచడంతో  ప్రజలు కోసం అనేక కార్యక్రమాలు  చేస్తున్నామని  భాజపా రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ అన్నారు ,పార్టీ జాతీయ అధ్యక్షుడు  నడ్డా పిలుపు మేరకు రాష్టంలో ప్రతి కార్యకర్త 5 గురికి  భోజనాలు పెడుతున్నారని తెలిపారు ,భాజపా రాష్ట్ర కార్యాలయంలో  మాస్కుల తయారీపై  డెమోను  సంజయ్ ప్రారంభించారు ,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భాజపా మహిళ మోర్చా అధ్యరంలో  ఉమ్మడి జిల్లాకు లక్షకు తగ్గకుండా ,రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలు  మాస్క్లు ఉచితంగా  పంపిణి చేయన్నున్నట్లు  వెల్లడించారు ,డ్వాక్రా మహిళలు ,మహిళ కార్యకర్తల తో  మాస్కులు తయారుచేస్తున్నామని చెప్పారు .యువ మోర్చా అధ్యరంలో  రక్తదాన శిబిరాలు ఏర్పటు చేస్తున్నామని ,రక్తం అవసరo  ఉన్నవారు భాజపా నేతలను ,కార్యకర్తలను  సంప్రదించాలని సూచించారు ,భాజపా కార్యకర్తలు రక్తదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని సంజయ్ వివరించారు ."మోర్చా శిబిరం."!

No comments:

Post a Comment