నేడు మహాత్మజ్యోతిరావుపూలె 193 వ జయంతిని అనంతగిరి మండల బీసీ కార్యాలయంలో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజియాదవ్ మాట్లాడుతూ పూలె తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల కోసం వారి హక్కుల కోసం సమ సమాజ నిర్మాణం కోసం త్యాగం చేశారు ,బ్రహ్మలు ఆధిపత్యాన్ని వ్యతిరేఖిoచారు ,సమాజంలో సగానికి పైగా ఉన్న స్ర్రీలు అభివృద్ధి చెందకపోతే ఈ సమాజం అభివృద్ధి చెందదు అన్నాడు ,స్త్రీలు విద్యా అభివృద్ధి కోసం తన భార్య సావిత్రిభాయి పూలేను మహిళ ఉపాద్యారాయులుగా తీర్చిద్దినాడు పూలె బాలికల కోసం మొదటి పాఠశాలను 1945 లో పూణే స్థాపించాడు ,బానిసత్యానికి వ్యతిరేకంగా గులాంగిరి అనే నవలను రచించాడు.ఈ నవల నేటి సమాజంలో అగ్రకులాల ఆధిపత్యాన్ని చూపించింది ,నేడు బలుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం చేయకపోతే బానిసలాగే బ్రతకాలి ,పూలె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పూలె జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ యరసాని కృష్ణ మాట్లాడుతూ పూలె ఆశయ సాధన ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి ,రాష్ట్ర కార్యదర్శి కొలిచలం శ్రీనివాస్ రాష్ట్ర ,జిల్లా నాయకులు సహా , తదితరులు పాల్గొని ఘన నివాళిలు అర్పించారు .ఆశయ సాధనకై !
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment